Road Accident: ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం, ఇద్దరిని బలితీసుకున్న లారీ

Road Accident: ఎన్టీఆర్ జిల్లా (NTR District) విస్సన్నపేట మండలం (Vissannapeta Mandal News)లో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. విస్సన్నపేట నుంచి నూజివీడు వెళ్లే రహదారిలో రాణి కళ్యాణ మండపం సమీపంలో లారీ బైక్ ఢీకొన్నాయి. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై విస్సన్నపేట వైపు నుంచి నూజివీడు రోడ్డు వైపు వెళ్తుండగా, కైకలూరు నుంచి ఢిల్లీకి చేపల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు విస్సన్నపేట మండలం కొండపర్వ వాసులు కోలా మల్లిఖార్జునరావు (24), మాణికల విజయ్ బాబు (26)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *