Road Accident: గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District)లో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జిరగింది. గద్వాల పట్టణంలోని జమ్మిచేడు (Jammichedu) సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

పుట్టిన రోజుకు వెళ్లి
ఆరుగురు వ్యక్తులు కలిసి కారులో గద్వాలలోని ఓ వైద్యుడి కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. అనంతరం పెబ్బేర్‌ తిరిగి వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన ముగ్గురిని మల్దకల్‌కు చెందిన నరేశ్‌ (23), పెబ్బేర్‌కు చెందిన పవన్‌కుమార్‌ (28), గద్వాలకు చెందిన ఆంజనేయులు (50) గా గుర్తించారు.

ముగ్గురికి గాయాలు
మైలగడ్డకు చెందిన గోవర్దన్‌ (20), పాల్వాయికి చెందిన నవీన్‌ (20), గద్వాలకు చెందిన మహబూబ్‌ (23) తీవ్రంగా గాయపడటంతో ఆ ముగ్గురిని గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *