Murder In Nellore City: నెల్లూరు నగరం (Nellore City)లో సోమవారం పట్టపగలే దారుణం జరిగింది. నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద కూరగాయల మార్కెట్ పక్కనే గల రైతు బజారులో ఒక యువకునిపై అతని స్నేహితులే కత్తులతో దాడి చేశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువకుడుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన ఆటో డ్రైవర్ ఆసిఫ్గా గుర్తించారు. మార్కెట్ వద్ద మద్యం తాగి ఆసిఫ్, స్నేహితులు గొడవ పడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది.