Revanth Reddy: బిల్ట్ ఫ్యాక్టరీ (Built factory) పారిశ్రామిక యూనిట్ల పునరుద్ధరణకు అన్ని విధాల సహకరిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సోమవారం హైదరాబాద్లో అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. 2014లో మూతపడిన ములుగు(Mulugu) జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం పేపర్ ఫ్యాక్టరీ(Paper factory) పునరుద్ధరణపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి, ఉపాధిని కల్పించడానికి ములుగు జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కమలాపురంలోని బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐటీసీ కంపెనీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.