Orange Load Lorry: ఆదిలాబాద్ కుప్టిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నారింజపండ్లతో నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలోని పండ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. గమనించిన స్థానికులు పరుగు పరుగున వచ్చారు. రోడ్డుపై పడిపోయిన నారింజ పండ్లను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. సంచులు, గోతాలతో వచ్చి పండ్లను నింపుకుని తీసుకెళ్లారు.