ఓటీటీల్లోకి స్టార్స్ ఎంట్రీ.. అత్యధిక రెమ్యునరేషన్ ఆ హీరోకే!

ఓటీటీల్లో నటించేందుకు అగ్రతారలు పారితోషికం గట్టిగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఏ పాత్రలోనైనా సరే నటించడానికి రెడీ అంటున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్ ఓటీటీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 2022లో డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో ప్రసారమైన క్రైమ్ థ్రిల్లర్ షో ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’తో అజయ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీల్లో నటించిన స్టార్స్ పరంగా చూస్తే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు అజయ్ దేవగన్ అని లేటెస్ట్.

‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ 7 ఎపిసోడ్‌ల కోసం దాదాపు రూ.125 కోట్లు పారితోషికం తీసుకున్నారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ఒక్క ఎపిసోడ్‌కు రూ. 18 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలా ఓటీటీలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న భారతీయ నటుడిగా అజయ్ నిలిచారు. ఆ తర్వాత మరో నటుడు మనోజ్ భాజ్‌పేయి నిలిచారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో ఆయన నటించారు. ఈ సిరీస్ రెండవ సీజన్‌లో మనోజ్ ఏకంగా రూ. 10 కోట్ల వరకు తీసుకున్నారని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *