ఆపని మళ్లీ మళ్లీ చేయాలనుకుంటున్నా! : తాప్సీ

తాజాగా ‘డంకీ'(Dunki) చిత్రంతో అలరించింది తాప్సీ(Taapsee). ఇందులో మనుగా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసుకు దగ్గరైంది. విజయవంతమైన చిత్రంతో ఈ ఏడాదికి ముగింపు పలుకుతోంది తాప్సీ. ఈ సినిమా అందుకున్న విజయం గురించి శనివారం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తదుపరి చిత్రం ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ విషయాల్ని, షారుక్‌(Shah rukh khan)తో కలిసి డంకీలో నటించిన అనుభవాల్ని పంచుకుంది. ‘‘నేను షారుక్‌తో కలిసి నటిస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమా కోసం ఆయనతో రెండేళ్లు పనిచేశాను. ఈ జర్నీ ఎంతో నేర్పింది. షారుక్‌ జీవితంలో జరిగిన అన్నీ సంఘటనల్ని చిత్రీకరణ సమయంలో నాతో పంచుకున్నారు. మంచి నటులుగా ఎదగడానికి ఎన్నో విషయాలు చెప్పారు’’ అని తాప్సీ చెప్పింది.

‘‘హసీన్‌ దిల్‌రుబా’కు రానున్న సీక్వెల్‌ ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. మర్డర్‌ మిస్టరీగా రానున్న ఈ సినిమా మరింత థ్రిల్‌ని పంచుతుంది. ఫస్ట్‌ పార్ట్‌ కన్నా ఎక్కువ టర్న్‌, ట్విస్ట్‌, సస్పెస్స్‌ కథనంతో ఆసక్తిగా ఉంటుంది. దర్శకుడు జయ్‌ప్రద్‌ దేశాయ్‌, నిర్మాత కనికా థిల్లాన్‌ ఈ చిత్రం పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. నేనూ, విక్రాంత్‌ చేసిన పాత్రలు అలరిస్తాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ ప్రాజెక్టుకు ఫ్రాంచైజీని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము’’ అని చెప్పారు తాప్సీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *