‘ఒకటో నంబర్ కుర్రాడు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు నందమూరి తారకరత్న. హీరోగానే కాకుండా విలన్ గా కూడా అలరించారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తరుణంలో గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించి పది నెలలు కావొస్తుంది. ఆయన భార్య మాత్రం అతని జ్ఞాపకాలతో కుమిలిపోతుంది. తరచూ భర్తను తలచుకుంటూ ఇన్ స్టాలో పోస్ట్లు పెడుతుంటారు అలేఖ్య. ఆదివారం తారకరత్న పెద్ద కూతురు నిష్క బర్త్డే కావడంలో ఆయన భార్య ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. “నువ్వు ఈ లోకంలోకి వచ్చిన నిముషం నుంచి మాకెంతో గర్వంగా ఉంది. నీ నవ్వు, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ కూతురికి బర్త్ డే విషెస్ తెలిపారు. మీ ప్రతి అడుగులో మిమ్మల్ని ప్రేమించడానికి, మద్దతు ఇవ్వడానికి మీ అమ్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. అని భావోద్వేగానికి గురైంది. అలేఖ్య తన కూతురికి విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిష్కతో పాటు తారకరత్న, అలేఖ్యలకు కవల పిల్లలు తాన్యారామ్, రేయాలు కూడా ఉన్నారు.